Fake Darshan Tickets: పవిత్రమైన శ్రీశైలం ఆలయంలో కేటుగాళ్లు పెరిగిపోతున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులను దోచుకుంటున్నారు. స్వామివారి దర్శనం టికెట్ల పేరుతో నకిలీ దందాకు తెరలేపారు. పాత దర్శన టికెట్లను ఎడిట్ చేసి.. ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇద్దరిని అరెస్ట్ చేశారు. నకిలీ టికెట్ల దందా బయటికి రావడంతో భక్తులు అలర్ట్ అవుతున్నారు.