రైలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. గుంటూరులో 49వ గుడారాల పండుగ జరగనుంది. ఈ నేపథ్యంలో రైళ్లల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మెమూ రైళ్ల స్థానంలో నాలుగు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెస్తోంది. మార్చి 5, మార్చి 8వ తేదీలో కాకినాడ పోర్టు, విజయవాడ, గుంటూరు మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. 18 ఛైర్ కార్ కోచ్లతో వీటిని నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.