హైదరాబాద్లోని పాతబస్తీ మీర్చౌక్లో ఆదివారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో 8 మంది మరణించారు. గుల్జార్హౌస్ సమీపంలోని భవనంలో జరిగిన ఈ దుర్ఘటనలో ముగ్గురు పిల్లలతో సహా 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ లేదా గ్యాస్ లీకేజీ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.