మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. మహిళలకు స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పథకం అమలు తర్వాత బస్సులలో రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ ఏడాదిలో 2500 కొత్త ఎలక్ర్టికల్, సీఎన్జీ బస్సులు కొనుగోలు చేస్తామని.. కేంద్రం ఇచ్చే బస్సులను ఏడాది ఆఖరికి రోడ్డెక్కిస్తామని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు వెల్లడించారు.