ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్ట్ 15 నుంచి అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు పథకం అమలు చేయనున్నారు. ఈ క్రమంలోనే రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రాలలో అమలు చేస్తున్న విధంగానే ఏపీలోనూ మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తామన్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు పథకానికి త్వరలోనే మంచి పేరు పెట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు.