ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత గ్యా్స్ సిలిండర్ల పథకం అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. గ్యా్స్ సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లో గ్యాస్ సబ్సిడీ మొత్తం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే ఈ పద్ధతిలో మార్పులు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే దీపం పథకానికి సంబంధించి టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది.