ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు శ్రీకాకుళం జిల్లా హిరమండలం పోలీసులు నోటీసులు జారీ చేశారు. జూన్ 22వ తేదీ సోమవారం రోజున విచారణ కోసం పోలీస్ స్టేషన్కు రావాలంటూ దువ్వాడకు నోటీసులు అందజేశారు. ఈ నేపథ్యంలో ఆయన రేపు విచారణకు హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.