హైదరాబాద్లో ఏళ్ల తరబడి ఆస్తిపన్ను చెల్లించని వాణిజ్య భవనాలపై జీహెచ్ఎంసీ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. సోమాజిగూడ కత్రియా హోటల్, నాంపల్లి అరోరా కళాశాల సహా పలు ప్రముఖ సంస్థలను సీజ్ చేశారు. మార్చి నెలాఖరు వరకు 90 శాతం వడ్డీ రాయితీ సౌకర్యం ఉందని, బకాయిదారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. మరోవైపు.. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన హెచ్చరించారు.