కాకినాడ జిల్లా సీహెచ్ అగ్రహారం గ్రామంలో అదృశ్యమైన జ్ఞానేశ్వరి కేసులో మిస్టరీ వీడటం లేదు. చిన్నారి కనిపించకుండాపోయి 11 రోజులు గడుస్తుండగా.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించడం లేదు. ఇక ఈ కేసులో కీలక ఆధారంగా ఉన్న కుక్క కూడా చనిపోవటంతో.. పోలీసులు వ్యూహం మార్చినట్లు తెలిసింది. అడవి జంతువులు ఏవైనా లాక్కెళ్లాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇందులో భాగంగా మాంసాహారం నింపిన బొమ్మలను కంచెల వద్ద ఏర్పాటు చేసి కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నారు.