google data center investment andhra pradesh: ఏపీకి భారీ గుడ్ న్యూస్.. అక్టోబర్ 14న ఢిల్లీలో కీలక ప్రకటన వెలువడనుంది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్న సంకతి తెలిసిందే. ఈ విషయమై ఢిల్లీలో ఈ నెల 14వ తేదీన గూగుల్ ఒప్పందం చేసుకోనుంది. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రకటించారు. 50 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా సుమారుగా 25 వేలమందికి ప్రత్యక్షంగా.. 50 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.