Google in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో అంతర్జాతీయ సంస్థ రానుంది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే లులూ గ్రూప్ వంటి సంస్థలు ఆసక్తి చూపిన సంగతి తెలిసిందే. తాజాగా మరో అంతర్జాతీయ సంస్థ ఏపీలో కొలువు దీరనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీనిపై కీలక ప్రకటన చేశారు. అమరావతిలో వి- లాంచ్ పాడ్ 2025ను చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు ఏపీని నాలెడ్జ్ ఎకానమీ హబ్గా మార్చే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఏపీకి గూగుల్ రానున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.