Gorantla Madhav: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి పోలీసులు వెళ్లారు. ఓ కేసు విషయంలో వెళ్లిన పోలీసులు.. ఆయనకు నోటీసులు ఇచ్చారు. మార్చి 5వ తేదీన విచారణకు రావాలని పేర్కొన్నారు. పోక్సో కేసులో బాధితురాలి పేరును.. ఒక ఇంటర్వ్యూలో గోరంట్ల మాధవ్ వెల్లడించారని నమోదైన కేసులో పోలీసులు ఆయనకు నోటీసులు అందించారు. చంద్రబాబు ప్రభుత్వం కావాలని తనపై పెట్టిన కేసు అని గోరంట్ల మాధవ్ ఆరోపించారు. అయితే కేసు వివరాలు పూర్తిగా తెలిసిన తర్వాత స్పందిస్తానని చెప్పారు.