Gudivada Kolli Abhishek: అమెరికాలో అదృశ్యమైన గుడివాడ కుర్రాడి కథ విషాదాంతం

11 months ago 10
అమెరికాలో అదృశ్యమైన తెలుగు యువకుడి కథ విషాదాంతమైంది. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన కొల్లి శ్రీనివాసరావుకు ఇద్దరు కవల పిల్లలు. కొల్లి అభిషేక్, అరవింద్.. వీరిలో కొల్లి అభిషేక్ పదేళ్ల కిందట అమెరికా వెళ్లారు. అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. ఏడాది కిందట పెళ్లి కూడా జరిగింది. అయితే గడిచిన ఆరు నెల నుంచి అభిషేక్‌కు ఉద్యోగం లేనట్లు తెలిసింది. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. అయితే ఫీనిక్స్‌లో ఉన్న అభిషేక్ ఇటీవల కనిపించకుండా పోయాడు. అయితే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. అభిషేక్ తమ్ముడు అరవింద్ పోస్టు పెట్టటంతో ఈ విషయం తెలిసింది. అభిషేక్ మృతదేహాన్ని భారత దేశానికి తీసుకువచ్చేందుకు అరవింద్ విరాళాలు సేకరిస్తున్నట్లు తెలిసింది.
Read Entire Article