Gandhi Park Free Entry in Guntur: గుంటూరు కార్పొరేషన్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు, అలాగే ప్లాస్టిక్ రహిత నగరంగా గుంటూరును తీర్చిదిద్దేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం గుంటూరు వాసులకు బంపరాఫర్ ప్రకటించారు. కేజీ చెత్త తెచ్చిన వారికి గాంధీ పార్కులోకి ప్రవేశం ఉచితం అంటూ ప్రకటించారు. కేజీ ప్లాస్టిక్ వ్యర్థాలు తెచ్చిన వారికి పార్కులోకి ఫ్రీ ఎంట్రీ కల్పిస్తున్నారు. శుక్రవారం నుంచి ఈ ఆఫర్ అమల్లోకి వచ్చింది.