గుంటూరువాసులకు ముఖ్య గమనిక. ఆ రూట్లో బస్సుల ఛార్జీలు పెరిగాయి. శనివారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో అర్టీసీ బస్సులు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీంతో బస్సుల రూట్ల పరిధి పెరిగిందంటూ ఐదు రూపాయలు పెంచుతూ గుంటూరు ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.