ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా జీవీ రెడ్డి రాజీనామా చేశారు. ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారం గత కొన్నిరోజులుగా చర్చనీయాంశంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జీవీ రెడ్డి రాజీనామా నిర్ణయం హాట్ టాపిక్గా మారింది. మరోవైపు తన రాజీనామా లేఖను జీవీ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పంపించారు.