తెలంగాణలో ఈ ఖరీఫ్ సీజన్కు కూడా అన్నదాతలకు రైతు భరోసా లేనట్టేనని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పుకొచ్చారు. రైతు భరోసాపై రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ సబ్ కమిటీ రిపోర్టు ఇచ్చాకే రైతు భరోసా ఇస్తామంటూ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చేసిన కామెంట్లపై హరీష్ రావు స్పందించారు. ఆయన మాటలు చూస్తుంటే.. ఈ ఖరీఫ్ సీజన్కు కూడా రైతు భరోసా లేనట్టేనని హరీష్ రావు చెప్పుకొచ్చారు.