Harish Rao: అదానీ గ్రూప్ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాలు వద్దని చెప్పినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించగానే.. మరి అదానీ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల సంగతేంటని బీఆర్ఎస్ నేతలు.. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అదానీ విరాళం తిరస్కరించారు సరే కానీ.. మరి ఆ సంస్థలతో కుదిరిన ఒప్పందాలను ఏం చేస్తారని అడుగుతున్నారు. అదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.