హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు మరో నలుగురికి మల్కాజ్గిరి కోర్టు రిమాండ్ విధించింది. హెచ్సీఏ ఎన్నికల్లో అక్రమాలు, నిధుల దుర్వినియోగంపై తెలంగాణ క్రికెట్ అధ్యక్షుడు ఫిర్యాదు చేయడంతో సీఐడీ వారిని అరెస్ట్ చేసింది. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ సైతం టికెట్ల విషయంలో జగన్మోహన్ రావుపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఉచిత టికెట్ల కోసం బెదిరింపులకు పాల్పడ్డారని ఫ్రాంఛైజీ మేనేజర్ శ్రీనాథ్ లేఖ రాయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.