ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు హాఫ్ సెంచరీ దిశగా వెళ్తున్నాయి. బుధవారం రోజున నంద్యాల జిల్లా సంజామలలో 44.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. శుక్రవారం కూడా ఏపీలోని పలు జిల్లాలలో 43 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని.. దీనికి తోడు 34 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.