భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు వరకు హెచ్ఎండీఏ పరిధిని విస్తరించిన సంగతి తెలిసిందే. తాజాగా.. హెచ్ఎండీఏ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం 2050 మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోంది. రవాణా, ఆర్థిక అభివృద్ధి, నీటి వనరులు, గ్రీనరీ వంటి అంశాలపై ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. దీర్ఘకాలిక ప్రణాళికలతో భవిష్యత్ అవసరాలను తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.