హెచ్ఎండీఏ పరిధిలోని స్థలాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. దీంతో మరిన్ని స్థలాలను వేలం వేయాలని సర్కార్ భావిస్తోంది. కోకాపేట, బాచుపల్లిలో హెచ్ఎండీ స్థలాలు ఉండగా.. వాటి వేలానికి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. అత్యధికంగా కోకాపేటలో గజం కనీస ధర రూ. 1.75 లక్షలుగా నిర్ణయించారు. వేలంలో పాల్గొనడానికి డిపాజిట్ మొత్తాలను భారీగా పెంచారు.