SIT Confirms Sai Krishna Custodial Death In Remand Report: ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన విజయవాడకు చెందిన సాయికృష్ణది కస్టోడియల్ డెత్గా సిట్ తేల్చింది. సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేశారని.. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నా కోర్టులో హాజరుపర్చలేదని సిట్ తెలిపింది. సాక్షాలను నాశనం చేయడానికి సీఐ నాగరాజే కారణమని.. హైకోర్టును తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. సాయికృష్ణ కేసులో ఆధారాలు ధ్వంసం చేశారని.. ఈ కేసులో అన్ని తేలాలంటే నాగరాజును ప్రశ్నించాల్సి ఉందన్నారు.