ఉగాది, రంజాన్ సెలవుల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తాయని ప్రకటించింది. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపుల గడువు మార్చి 31. ప్రజల నుంచి వచ్చిన విన్నపాల కారణంగా ఆ ఉద్యోగులు పని చేసే విధంగా వారికి సెలవులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం కూడా ఆస్తిపన్ను వసూలు కేంద్రాలు రేపు, ఎల్లుండి పనిచేయనున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.