హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది. చనిపోయి నాలుగు రోజులైనా అంత్యక్రియలు నిర్వహించకుండా కుటుంబ సభ్యులు శవానికి ఇంట్లోనే పెట్టుకున్నారు. ఫ్రిజర్లో శవాన్ని ఉంచి ప్రార్థనల పేరుతో రోజులు గడపుతున్నారు. శవం నుంచి దుర్వాసన వస్తున్నా.. స్థానికులు హెచ్చరించినా పట్టించుకోకుండా అలాగే శవాన్ని ఇంట్లో పెట్టుకున్నారు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేయటంతో వారు దిగొచ్చారు.