తెలంగాణ ప్రభుత్వం రూ.60,799 కోట్లతో రహదారుల నెట్వర్క్ అభివృద్ధికి చారిత్రక నిర్ణయం తీసుకుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని రూ.10,400 కోట్లతో 8 వరుసల రహదారిగా విస్తరించడంతో పాటు, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం కూడా చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ భారీ ప్రాజెక్టులు రాష్ట్ర మౌలిక వసతులకు కొత్త దిశానిర్దేశం చేయనున్నాయన్నారు.