హైదరాబాద్ శివారులో దొంగల బీభత్సం సృష్టించారు. దుండిగల్ పరిధిలో పక్క దుకాణాన్ని అద్దెకు తీసుకుని.. గోడకు కన్నం వేసి 15 కిలోల వెండి ఆభరణాలను అపహరించారు. సీసీ కెమెరాల డీవీఆర్, హార్డ్డిస్క్లను కూడా ఎత్తుకెళ్లారు. వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించి, పక్కా ప్రణాళికతో ఈ భారీ చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.