తెలంగాణలో అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా.. భరత్నగర్ రైల్వే స్టేషన్ను వ్యూహాత్మక రవాణా కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి కేవలం 200 మీటర్ల దూరంలో మెట్రో, బస్ స్టాప్లు ఉండటంతో ఇది ఇంటర్ఛేంజింగ్ పాయింట్గా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఐటీ కారిడార్ మార్గంలో ఒకే ఎంఎంటీఎస్ సర్వీస్ నడుస్తుండటంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్లాట్ఫామ్-3ని ఏర్పాటు చేసి.. సర్వీసుల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.