ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు సాగించే హైదరాబాద్ నగర ప్రజలకు నిజంగా ఇది తీపి కబురే. ఎందుకంటే త్వరలో బస్సుల్లో హాయిగా కూర్చొని ప్రయాణం చేయవచ్చు. ప్రస్తుతం బస్సుల్లో రద్దీ విపరీతంగా ఉండగా.. రద్దీకి తగ్గట్లుగా కొత్త ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాలని ఆర్టీసీ యోచిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ కల్లా కొత్తగా 235 బస్సులు తీసుకురావాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది.