ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పుల వల్ల బీపీ, షుగర్ వంటి వ్యాధులు పెరిగాయి. పరీక్షల ఖర్చు, సమయం లేకపోవటంతో చాలామంది టెస్టులు చేయించుకోటంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్డియాలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (CSI) హైదరాబాద్లోని ఎంజీబీఎస్ బస్ స్టేషన్ ఉచిత బీపీ చెకింగ్ కియోస్క్ను ఏర్పాటు చేసింది. ఇది తక్షణమే బీపీ, పల్స్ రేట్ చూపుతుంది. సరైన ప్రచారం లేకపోవటంతో మిషన్ను ఎవరూ ఉపయోగించటం లేదు. అవగాహన పెంచితే ప్రజలు తమ ఆరోగ్యాన్ని సులభంగా పర్యవేక్షించుకోవచ్చు.