చాలాకాలం పాటు పెండింగ్లో ఉన్న ఫలక్నుమా సమాంతర రోడ్డు ఓవర్బ్రిడ్జి (RoB) నిర్మాణం పూర్తయింది. 360 మీటర్ల పొడవైన ఈ వంతెన శుక్రవారం (అక్టోబరు 3) ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రూ. 47.1 కోట్లతో GHMC, SCR సంయుక్తంగా నిర్మించిన ఈ RoB, చాంద్రాయణగుట్ట నుండి చార్మినార్ వైపు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గించనుంది. దీని ప్రారంభంతో దక్షిణ హైదరాబాద్ ప్రజలకు ప్రయాణం సులభతరం కానుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.