హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు ప్రాంతంలో భూముల ధరలు పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మార్కెట్ విలువను సవరించడానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఆయా ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువ పెరగనుంది. మరోవైపు శంషాబాద్ సమీపంలో రూ.300 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.