హైదరాబాద్లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. బండ్లగూడలో వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా కరెంట్ షాక్తో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇదిలా ఉండగా.. రామంతాపూర్ శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో రథం విద్యుత్ తీగలను తాకడంతో ఐదుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవకముందే తాజాగా దుర్ఘటన జరిగింది.