హైదరాబాద్ నగరంలోని క్యాబ్ డ్రైవర్స్ మండు వేసవిలో కస్టమర్లకు షాక్ ఇచ్చేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 24 నుంచి నగరంలో 'నో ఏసీ క్యాంపెయిన్' ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అగ్రిగేటర్స్ న్యాయమైన కమిషన్ చెల్లించటం లేదని.. అందుకే నిరసన చేపట్టనున్నట్లు ఉబెర్, ఓలా, రాపిడో క్యాబ్ డ్రైవర్లు వెల్లడించారు. ఒక వేళ కస్టమర్లకు ఏసీ కావాలంటే టిప్ చెల్లించాలని కోరుతున్నారు.