హైదరాబాద్లో ఎండల తీవ్రతతో పాటు రేడియేషన్ ప్రభావంతో కాకులు అరుదుగా మారుతున్నాయి. పురానాపూల్ శ్మశానవాటికలో దశదిన కర్మలో పిండం ముట్టేందుకు కాకులు రాకపోవడంతో.. ఒక కుటుంబం మార్కెట్ నుంచి కాకిని కొనుగోలు చేసి తెచ్చి ఆచారాన్ని పూర్తి చేసింది. మారుతున్న టెక్నాలజీ, పర్యావరణ విధ్వంసం మూగజీవాల ఉనికిని ఎలా దెబ్బతీస్తున్నాయో.. అది మానవ జీవనశైలిపై ఎలా ప్రభావం చూపుతోందో.. ఈ ఘటన నిదర్శనమని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.