హైదరాబాద్లో భారీ వర్షాల వల్ల తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో వరదలు, ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కనుగొనాలని, మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును వేగవంతం చేయాలని ఆయన సూచించారు. భవిష్యత్తులో వర్షాలు కురిసినా నీరు నిల్వ ఉండకుండా వందేళ్ల అవసరాలకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో మల్టీ లెవల్ పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేయాలన్నారు.