ఖమ్మం నగరం కొత్త రూపు సంతరించుకోనుంది. హైదరాబాద్ దుర్గం చెరువు తరహా తీగల వంతెనను మున్నేరు నదిపై వేగంగా నిర్మిస్తున్నారు. రూ.180 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ కేబుల్ బ్రిడ్జి నగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురానుంది. వాహనాలతో పాటు పర్యాటకుల కోసం ఫుట్పాత్లు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తున్నారు. కేబుల్ బ్రిడ్జి పిల్లర్ల పనులు చివరి దశలో ఉండగా.. త్వరలోనే రాకపోకలు పునరుద్ధరిస్తారు.