హైదరాబాద్ కోకాపేట నియోపొలిస్లో రూ.65 కోట్ల వ్యయంతో నిర్మించిన ట్రంపెట్ జంక్షన్ను అందుబాటులోకి వచ్చింది. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ జంక్షన్ ప్రారంభించనున్నారు. నియోపొలిస్, శంకర్పల్లి ప్రాంతాల ప్రజలకు ఔటర్ రింగ్ రోడ్డుకు నేరుగా చేరుకోవడానికి ఈ జంక్షన్ ఉపయోగపడుతుంది. దీని ద్వారా ప్రయాణ సమయం తగ్గి.. శంషాబాద్ విమానాశ్రయానికి 20 నిమిషాల్లో చేరుకోవచ్చు.