పెట్టిన పెట్టుబడికి 500 శాతం లాభం వస్తుందని నమ్మబలికిన సైబర్ మోసగాడు 58 ఏళ్ల వ్యక్తిని ఉచ్చులో పడేశాడు. వాట్సాప్ గ్రూప్ ద్వారా పెట్టుబడి ఆఫర్ ఇచ్చి నమ్మకం గెలుచుకున్నాడు. బాధితుడి ఖాతాలో రూ.1.92 కోట్లు కనిపించడంతో ఆశపడ్డ ఆయన.. మోసగాడి మాటలు నమ్మి రూ.75 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. తర్వాత డబ్బు విత్డ్రా కాకపోవడంతో నిజం తెలిసి షాక్కు గురయ్యాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఇదే తరహాలో ఆ నేరగాడు మరో ఏడుగురిని మోసం చేసి ఒక్క రోజులో రూ.2.55 కోట్లు దోచుకున్నట్టు పోలీసులు తెలిపారు.