హైదరాబాద్లో స్థిరాస్తి రంగానికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్ జిల్లాల్లోని ప్రభుత్వ భూములను ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించనుంది. HMDA ఈ ప్రక్రియను నిర్వహిస్తుంది. ఆయా ప్రాంతాల్లో చదరపు గజానికి రూ. 25,000 నుంచి రూ. 35,000 వరకు ఆప్సెట్ ధర నిర్ణయించనున్నారు. కోకాపేటలో గజం లక్ష రూపాయల వరకు పలికే అవకాశం ఉంది. ఈ వేలం ద్వారా వచ్చే నిధులను అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తారు.