హైదరాబాద్ ఫిల్మ్నగర్ పరిధిలో ఓయూ కాలనీలో నివాసం ఉంటున్న స్వప్న ఇంట్లో 43 తులాల బంగారం, లక్ష నగదు చోరీకి గురయ్యాయి. ఆమె అత్తవారింటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి గుర్తు తెలియని దుండగులు ఇల్లు గుల్ల చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.