బాలాపూర్లో 'ధర్మ రక్షా సభ'కు తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది. రోహింగ్యా, బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులను వెనక్కి పంపాలనే డిమాండ్తో ఈ సభ జరుగుతోంది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయన్న పోలీసుల వాదనను కోర్టు తోసిపుచ్చింది. అయితే, సభ సమయం, హాజరయ్యే వారి సంఖ్యపై కఠిన షరతులు విధించింది.