తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా.. కొత్త రూపంలో గంజాయి ప్రవేశిస్తోంది. హైడ్రోపోనిక్ గంజాయి పేరుతో విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ఈ మత్తు పదార్థం బంగారం కంటే విలువైనదని పోలీసులు చెబుతున్నారు. దీని ఒక్క గ్రాము రూ.10 వేలు, కిలో రూ. కోటి పలుకుతోంది. శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా పట్టుబడుతున్న ఈ గంజాయి యువతను మత్తులో ముంచే ప్రమాదం ఉంది. దీనిని అరికట్టడానికి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.