విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తగ్గించడానికి విద్యుత్ సంస్థ ఆటోమెటిక్ మీటర్ రీడింగ్ (ఏఎంఆర్) సాంకేతికతను వినియోగించనుంది. దీని ద్వారా 33kV, 11kV ఫీడర్లలో అంతరాయాలను కార్యాలయంలోనే తెలుసుకోవచ్చు. వేసవిలో ట్రాన్స్ఫార్మర్ల ఓవర్లోడ్ను కూడా ఏఎంఆర్ ద్వారా గుర్తించవచ్చు. డీటీఆర్ స్థాయిలో ఏఎంఆర్ ఏర్పాటుతో నష్టాలను గుర్తించి నివారించవచ్చు. హైదరాబాద్ నగరంలోని అన్ని నియంత్రికలకు దశలవారీగా ఏఎంఆర్ ఏర్పాటు చేయనున్నారు.