Muthyalamma Temple: సికింద్రాబాద్ కుమ్మరిగూడలో ఇటీవల వార్తల్లో నిలిచిన ముత్యాలమ్మ ఆలయంలో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. ధ్వంసం చేసిన అమ్మవారి విగ్రహాన్ని పున:ప్రతిష్టాపించి శాంతి పూజలు, హోమం నిర్వహిస్తుండగా ఓ మహిళా అఘోరి అక్కడికి వచ్చారు. ఒంటి కాలిపై నిల్చొని పూజలు చేశారు. సాక్షాత్తూ అమ్మవారే ఆమెను పంపించినట్లుగా భావించిన స్థానికులు భక్తిభావంతో భావోద్వేగానికి లోనయ్యారు. మరోవైపు.. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడు ముంబైకి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు.