హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. త్వరలో మెట్రో రైళ్లలో కోచ్ల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం ఉన్న మూడు కోచ్ల రైళ్లకు అదనంగా నాలుగు, ఆరు కోచ్ల రైళ్లను ప్రవేశపెట్టేందుకు HMRL పరిశీలిస్తోంది. దీనివల్ల రైళ్ల మధ్య సమయం రెండు నిమిషాలకు తగ్గి, ప్రయాణికుల రద్దీ సమస్య తీరనుంది.