హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల కోసం ఫోన్పే సంస్థ రూపే ఆన్-ది-గో కార్డును ప్రారంభించింది. ఇది నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు కింద పని చేయనుంది. ఇంటర్నెట్ లేకపోయినా పూర్తిగా ఆఫ్లైన్లో ట్యాప్-అండ్-పే పద్ధతిలో ఈ కార్డు ద్వారా చెల్లింపులు చేయవచ్చు. మెట్రో కౌంటర్లలో లభించే ఈ కార్డులో గరిష్ఠంగా రూ. 2 వేల వరకు నగదు నిల్వ చేసుకోవచ్చు.