హైదరాబాద్ మెట్రోలో కొత్త రూల్తో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. స్టేషన్ లోకి వెళ్ళాక 2 గంటల్లో బయటకు రావాలి. లేదంటే ఫైన్ కట్టాలి. కొందరు ప్రయాణికులు ఈ టైం దాటిపోవడంతో అదనంగా డబ్బులు కట్టాల్సి వస్తోంది. ముఖ్యంగా కారిడార్-2 లో రైళ్లు ఆలస్యం అవ్వడం వల్ల ఈ సమస్య ఎక్కువైందని... అధికారులు దీనిపై ఆలోచించాలని ప్రయాణికులు కోరుతున్నారు.