ఇటీవల భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలమై.. భారీగా ట్రాఫిక్ జామ్ కావటంతో నగరవాసులు చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే, ఈ సమస్యకు పరిష్కారంగా హైడ్రా అధికారులు సరికొత్త సాంకేతికతను ప్రవేశపెట్టారు. ఇకపై వర్షం కురవడానికి రెండు గంటల ముందే సెల్టవర్ల ఆధారంగా SMSల ద్వారా ప్రజలకు హెచ్చరికలు పంపనున్నారు. NDMA, IMD సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఒకేసారి 5 లక్షల మందికి SMSలు అందుతాయి.