హైదరాబాద్ నుంచి రైల్వే ప్రయాణాలు సాగించే వారికి తీపి కబురు. నగరంలోని రైల్వే స్టేషన్ల ద్వారా సరికొత్త ప్రయాణ అనుభూతి పొందనున్నారు. అమృత్ భారత్ పథకం కింద పలు రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు చేపట్టగా.. మూడు నెలల్లో ఈ పనులు పూర్తవుతాయని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు.